వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితురాలు ఎప్పుడు బయటకు వచ్చిందనేది కాదు: తనుశ్రీ దత్తాకు మేనకా గాంధీ మద్దతు

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ నటి తనుశ్రీ దత్తాకు కేంద్రమంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. తనుశ్రీ ఇటీవల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఆమె నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. పదేళ్ల క్రితం సినిమా సెట్లో తన చేయి పట్టుకున్నారని చెప్పింది. ఇదీ సంచలనంగా మారింది.

తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదే విషయమై తాజాగా మేనకా గాంధీ కూడా స్పందించారు. వేధింపులను ఉపేక్షించేది లేదని చెప్పారు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఎప్పుడు బయటకు వచ్చారనేది విషయం కాదన్నారు.

Maneka Gandhi supports Tanushree Dutta, says it does not matter when the victim comes out

మన దేశంలో కూడా 'మీటూ' ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. దీని ద్వారా ఏ మహిళ అయినా సరే తనకు ఎదురైన వేధింపుల గురించి మాకు ఫిర్యాదు చేయవచ్చునని, మేం దానిపై విచారణ జరుపుతామన్నారు.

తనుశ్రీ ఇన్నేళ్ల తర్వాత వేధింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నించగా... హాలీవుడ్‌ దర్శకుడు హార్వే వెయిన్‌స్టీన్ వేధించారని ఓ నటి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇలానే అన్నారని, కానీ బాధితురాలు ఎప్పుడు ముందుకొచ్చి చెప్పింది అనేది విషయం కాదన్నారు.

English summary
Days after Tanushree Dutta alleged that Nana Patekar harassed her on the sets of a film in 2008, the Union Minister for Women and Child Development Maneka Gandhi came out in support of the actor, saying that "harassment of any kind will not be tolerated."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X