వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్ మీటింగ్: సెల్ఫీలు తీస్తూ బదిలి అయ్యాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: జిల్లా కలెక్టర్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సీనియర్ అధికారులు హాజరైనారు. పలు శాఖల అధికారులను నుంచి జిల్లా కలెక్టర్ సమాధానాలు అడుగుతున్నారు. అయితే ఆ సందర్బంలో ఓ అధికారి సెల్ఫీ తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బారాబంకి జిల్లా కలెక్టర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా అధికారులతో ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు అందరూ హాజరైనారు.

Mangal Pandey as the latter was busy clicking selfies from his mobile phone

ఇదే సమావేశానికి బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి (బీడీఓ) మంగల్ పాండే అనే ఆయన హాజరైనారు. కలెక్టర్ యెగేశ్వర్ అధికారులతో సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో మంగల్ పాండే తన జోబులోని స్మార్ట్ ఫోన్ బయటకు తీశారు.

సమావేశం గురించి ఆలోచించకుండా సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపారు. విషయం గుర్తించిన జిల్లా కలెక్టర్ యోగేశ్వర్ రామ్ మిశ్ర మండిపడ్డారు. మంగళ్ పాండేని ఆ పదవి నుంచి తప్పిస్తూ ఆ స్థానంలో సుశాంత్ సింగ్ అనే అధికారిని నియమిస్తూ సంఘటనా స్థలంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ దెబ్బతో అధికారులు షాక్ కు గురైనారు.

English summary
District Magistrate Yogeshwar Ram Mishra conducted a meeting in Barabanki for district officials in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X