వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టాలు తప్పిన మంగళ రైలు: నలుగురు మృతి?
శిథిలాల కింద 25 మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. రైలు ప్రమాదం శుక్రవారం ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగింది. మధ్య రైల్వేలోని నాసిక్ సమీపంలో ఘోటీ - ఇగ్తాత్పూర్ సెక్షన్ మీదుగా వెళ్తుండగా నిజాముద్దీన్ - ఎర్నాకులం మంగళ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. గాయపడినవారిని ఘోటీ,త కాసర, నాసిక్ సివిల్ ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడానికి మధ్య రైల్వే హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది.
ఈ
ప్రమాదంతో
రైళ్ల
రాకపోకలకు
అంతరాయం
ఏర్పడింది.
మన్మాడ్
-
కుర్లా
-
గోదావరి
ఎక్స్ప్రెస్,
మన్మాడ్
-
ముంబై
పంచవటి
ఎక్స్ప్రెస్
రైళ్లతో
పాటు
పలు
రైళ్లు
రద్దయ్యాయి.
సేవాగ్రామ్
ఎక్స్ప్రెస్,
రాజ్య
రాణి
ఎక్స్ప్రెస్
రైళ్లను
లాసాల్గావ్
వద్ద
నిలిపేశారు.
Comments
English summary
Six coaches of Ernakulam-bound Mangala Express derail near Nashik; 5 feared dead.