వామ్మో: 1. 247 కేజీల బంగారం ఏ రంధ్రంలో పెట్టారో తెలుసా, ఎయిర్ పోర్టులో అరెస్టు, షాక్ !
మలమూత్రం వెళ్లే రంధ్రంలో బంగారం దాచి పెట్టుకున్న ఇద్దరు నిందితులను కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ బజ్పే విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన దీపక్ ఇందర్ దాస్ సిద్వాని, నిర్మల్ అనే ఇద్దరిన
మంగళూరు: మలమూత్రం వెళ్లే రంధ్రంలో బంగారం దాచి పెట్టుకున్న ఇద్దరు నిందితులను కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ బజ్పే విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన దీపక్ ఇందర్ దాస్ సిద్వాని, నిర్మల్ అనే ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు.
నిందితుల నుంచి 1 కేజీ 247 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని మంగళూరు అంతర్జాతీయ బజ్పే విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపారు. గురువారం దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన విమానంలో సాటి ప్రయాణికులతో పాటు నిర్మల్, దీపక్ వచ్చారు.
తరువాత దీపక్, నిర్మల్ అనుమానాస్పదంగా వెలుతున్న విషసయం గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అసలు విషయం తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు. నిందితులు ఇద్దరూ 1 కేజీ 247 గ్రాముల బరువున్న నాలుగు బంగారు బిస్కెట్లు మలమూత్ర విసర్జన అయ్యే రంధ్రంలో దాచి పెట్టుకుని వచ్చారని గుర్తించి అరెస్టు చేశారు.
నిందితులు బంగారం దాచి పెట్టింది ఎక్కడో తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దుబాయ్ లో బంగారం అతి తక్కువ ధరకు చిక్కుతుందని, ఆ బంగారంకు పన్ను చెల్లించకుండా తీసుకు వచ్చిన భారత్ లో అధిక ధరకు విక్రయించడానికి ప్రయత్నించారని కస్టమ్స్అధికారులు తెలిపారు.