రూ. 83 కోట్ల జీఎస్ టీ మోసం చేసిన గుజరి వ్యాపారులు, నకిలి బిల్లులతో దందా !
మంగళూరు: నకిలి బిల్లులు తయారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన ముగ్గురు గుజరీ వ్యాపారులను కర్ణాటకలోని మంగళూరు అధికారులు అరెస్టు చేశారు. మంగళూరులోని గుజరి వ్యాపారులు తౌహిద్, గుజరీ డీలర్ అబ్దుల్ రహీం, అబ్దుల్ ఖాదర్ లను అరెస్టు చేశామని మంగళూరు కేంద్రియ జీఎస్ టీ కమిషనరేట్ అధికారులు తెలిపారు.
మంగళూరులోని జీఎస్ టీ అధికారులు పన్ను ఎగవేస్తున్న వ్యాపారుల జాబితాను సిద్దం చేశారు. గుజరి వ్యాపారులు భారీ మొత్తంలో జీఎస్ టీ పన్ను చెల్లించుకుండా మోసం చేశారని అధికారులు పసిగట్టారు. కచ్చితమైన ఆధారాలు సేకరించిన అధికారులు గుజరీ వ్యాపారులను గుర్తించి అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన గుజరి వ్యాపారులు రాష్ట్రంలో పలు మోసాలు చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు గుజరి వ్యాపారులు దాదాపు రూ. 15 కోట్ల నకిలి బిల్లులు తయారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
గుజరి వ్యాపారులు ఇప్పటి వరకు రూ. 83 కోట్ల జీఎస్ టీ పన్ను చెల్లించకుండా మోసం చేశారని అధికారులు తెలిపారు. గుజరి వ్యాపారులు అల్యూమినియం కాపర్ రాడ్ లు తయారు చేసి నకిలి బిల్లులు తయారు చేసి విక్రయించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.