Cooker bomb: ప్రభుత్వం సంచలన నిర్ణయం, కేసు ఆ టీమ్ కు అప్పగింత. మ్యాటర్ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మంగళూరులో అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ బాంబు పేలుడుకు పెద్ద స్కెచ్ వేశాడని. అయితే చివరి నిమిషాల్లో ఆ స్కెచ్ రివర్స్ అయ్యిందని అధికారులు అంటున్నారు. అయితే కుక్కర్ బాంబు పేలుడు కేసు ఎన్ఐఏకి అప్పగిస్తామని కర్ణాటక హోమ్ మంత్రి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు చెప్పారు. ఎన్ఐఏ ఎంట్రీతో అనుమానిత ఉగ్రవాది షారిఖ్. అతని గ్యాంగ్ వివరాలు మొత్తం బయటకురానున్నాయి.
Wife: మేడమ్ కు నాలుగో భర్త, సార్ కు రెండో భార్య, ఫామ్ హౌస్ లో పంచాయితీతో ప్రాణాలు ?, క్లైమాక్స్!
ఉలిక్కిపడిన కన్నడిగులు
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో నివాసం ఉంటున్న మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటోలో షారిఖ్ కుక్కర్ బాంబు తీసుకు వెలుతున్న సమయంలో మార్గం మద్యలోనే ఒక్కసారిగా పేలిపోయింది.
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది
షారిఖ్ కుక్కర్ బాంబును వేరే ప్రాంతంలో పేల్చడానికి ప్రయత్నించి ఉంటాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఆటోలో జరిగిన కుక్కర్ బాంబు పేలుడులో అనుమానిత ఉగ్రవాది షారిఖ్ తో పాటు ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎన్ఐఏ ఎంట్రీతో షాక్
షారిఖ్ మంగళూరులోని ఏ ప్రాంతానికి వెళ్లాలని ప్రయత్నించాడు. అతని టార్గెట్ ఏమిటి అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే ససందర్బంలో మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. బుధవారం కర్ణాటక హోమ్ శాఖా మంత్రి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు చెప్పారు. మంగళూరు కుక్కర్ బాంబు కేసును ఎన్ఐఏకి అప్పగిస్తామని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.