మోడీపై అనుచిత వ్యాఖ్యలు: మణిశంకర్ అయ్యర్పై కాంగ్రెస్ వేటు
Recommended Video
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.
అవమానమే, మూల్యం చెల్లించుకుంటారు: కాంగ్రెస్కు మోడీ వార్నింగ్, మణిశంకర్కు కౌంటర్
అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం మణిశంకర్ అయ్యర్కు షోకాజు నోటీసులు జారీ చేసి.. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రధాని మోడీని నీచ్(తక్కువ స్థాయి మనిషి) అంటూ మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయ్యర్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా తీవ్రంగానే స్పందించారు. అది కాంగ్రెస్ పార్టీ విధానమంటూ విరుచుకుపడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.