వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: తాజ్ మహల్ లోకి మణిపూర్ విద్యార్థులకు నో ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: విహారయాత్రకు వెళ్లిన మణిపూర్ విద్యార్థులను ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అయిన ఆగ్రాలోని తాజ్ మహల్ లోకి అడుగు పెట్టనివ్వకపోవడంతో ఇప్పుడు పెద్ద రచ్చ మొదలైయ్యింది. ఎందుకు విద్యార్థులను తాజ్ మహల్ చూడటానికి అనుమతి ఇవ్వలేదని విచారణ మొదలైయ్యింది.

ఇంఫాల్ లోని సెంట్రల్ వ్యవసాయ విశ్వవిధ్యాయానికి చెందిన విద్యార్థులు భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను చూడటానికి విహారయాత్రకు బయలుదేరారు. ఆదివారం మద్యాహ్నం 3.30 గంటలకు అందరూ తాజ్ మహల్ చూడటానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది (సీఐఎస్ఎఫ్) విద్యార్థులను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

Manipur students allegedly denied entry into Taj Mahal

తాజ్ మహల్ వీక్షించాలంటే వీదేశీయులు రూ. 1,000, రూ. భారతీయులు రూ. 40 టిక్కెట్లు తీసుకోవాలి. మణిపూర్ విద్యార్థులు చూడటానికి వీదేశీయులు లాగా ఉన్నారని ఆరోపిస్తూ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతి ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై భారత పురావస్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మణిపూర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, తాజ్ మహల్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ ఇవ్వాలని సూచించామని భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

English summary
A group of students from Manipur were allegedly denied entry into the Taj Mahal and asked to produce proof of their nationality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X