ఒడిశాలో మరోసారి రెచ్చిపోయిన మావోలు...
ఒడిశాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.మల్కాన్గిరి జిల్లాలోని తిముర్పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు.కాగ ఇది శుక్రవారం అర్ధరాత్రీ జరిగినట్టుగా తెలుస్తోంది. మందుపాతరలతో పంచాయితీ కార్యాలయాన్ని పేల్చివేయడంతో మొత్తం భవనం శిధిలమైంది. కాగా ఈ దాడీలో సుమారు ముప్పై నుండి నలబై మంది మావోయిస్టులు పాల్గోన్నటు సమాచారం. కాగా భవనాన్ని బాంబులతో దాడి చేయడంతో శిధిలకం కావడంతోపాటు అందులో ఫర్నిచర్,ఇతర వస్తువులు కాళీ బుడిదయ్యాయి. కాగా విషయాన్ని తెలుసుకున్న ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో మావోలు ఘాతుకాలకు పాల్పడ్డా సంఘటనలు లేవు. మావోలకు పట్టుఉన్న ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించారు. కాగా పోలీంగ్ చివరిదశ కావడంతో రాష్ట్ర్రవ్యాప్తంగా ఉద్రక్తవాతవరణ నెలకొని ఉంది.