'వక్షోజాలు చూపిస్తూ, నగ్నఫోటోలు చూసిరెచ్చిపోవద్దు'
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నగ్న చిత్రాలు చూసి రెచ్చిపోవద్దని ఓ వర్గానికి చెప్పి ఆయన విమర్శల పాలవుతున్నారు.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లీంల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దని ఆయన ముస్లీంలకు సూచించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో రాసి, ఆ లింకును ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఒక మహిళా తన దుస్తులు పక్కకు తీసి తన వక్షోజాలు చూపిస్తున్నట్లు, నగ్నంగా కాబా పైన నిల్చున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తోందని చెప్పారు. మరో ఫోటోలో ఇద్దరు అమ్మాయిలి నగ్నంగా బీచ్లో పడుకొని ఉంటారని, దానికి.. 'ఇది రంజాన్, బికినీలు వేసుకోవద్దని' క్యాప్షన్ పెట్టారని తెలిపారు. ఇలాంటి ట్వీట్లు చూసి ఉద్రేకానికి లోనుకావొద్దన్నారు.