ప్రేమ వైఫల్యం...తుపాకులతో కాల్చుకుని ఆత్మహత్య...
ప్రేమ వైఫల్యం చెందిందని ఓ జంట ఓకరినొకరు కాల్చుకుని చనిపోయారు. చనిపోయో ముందు పిస్టోళ్లతో సెల్ఫీ దిగారు. అయితే చనిపోయిన జంటలో ప్రియురాలికి పెళ్లి అయింది. పెళ్లి అయినా.. ప్రియుడి జ్ఝాపకాలను మరిచిపోలేదు. దీంతో ఇద్దరు ఒకే దగ్గర చేరి గన్స్తో కాల్చుకుని చనిపోయారు.
రాజస్థాన్లోని బార్మార్ జిల్లాకు చెందిన అంజు సుతార్,శంకర్లు ప్రెమించుకున్నారు. ఇద్దరు కలిసి కొద్ది రోజులు సహజీవనం కూడ చేశారు.అంతలోనే ప్రియురాలు అంజు సుతార్కు వివాహం జరిగింది. దీంతో ప్రియుడు విరహవేదనకు గురయ్యాడు. మరోవైపు ప్రియురాలు సైతం చేసుకున్న భర్తను కాదని ప్రియుడి దగ్గరకు వచ్చేసింది. అనంతరం ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే కాల్చుకుని చనిపోయారు. కాగా అంతకు ముందు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్లో రికార్డ్ చేశారు. తుపాకులు గురి పెట్టుకుని సెల్ఫీలు దిగారు.
ఇక ప్రేమికులు కాల్చుకుని చనిపోయిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న నాటు తుపాకులను స్వాధినం చేసుకున్నారు. తుపాకులతోపాటు ఫోన్ ఇతర వస్తువులను స్వాధినం చేసుకున్నారు. అయితే కాల్చుకునే ముందు మృతులు మద్యం సేవించినట్టు పోలీసులు తెలిపారు.