భర్తకు బెయిల్.. పోలీసులకు చుక్కలు.. పీఎస్పై మహిళ దాడి
టెక్కలి : పోలీసులకు చుక్కలు చూపించారు ఓ మహిళ. ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి హంగామా చేశారు. ఆమె హల్చల్ చూసి ఖాకీలే కంగు తినాల్సిన పరిస్థితి ఎదురైంది. చూసుకో నా తడాఖా అనే రేంజ్లో సదరు వివాహిత రెచ్చిపోయిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
పాత పట్నం ఏరియాకు చెందిన వందనా దేవికి.. భవానీ పురానికి చెందిన నాగరాజుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అయితే గత ఐదేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ క్రమంలో విడిగా ఉంటున్నారు ఇద్దరు. కుటుంబ వివాదాల కేసు కూడా కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసి టెక్కలి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.
కొడుకుతో చంద్రబాబుకు బాధలే.. బుద్దా వెంకన్నకు అది కూడా లేదు.. వైసీపీ ఎమ్మెల్యే మాటల తూటాలు
అలా అరెస్ట్ చేశారో లేదో ఇలా అతడు బెయిల్పై బయటకు వెళ్లాడనేది వందనా దేవి కోపానికి కారణం. దాంతో ఆమె పోలీసుల తీరును తప్పు పట్టారు. అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేస్తారా అంటూ ఖాకీలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆ కోపంలో పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసం చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ జీపుపై కూడా దాడి చేశారు.
ఇదంతా చూస్తున్న పోలీసులు ఆమెను నిలువరించ లేకపోయారు. పోలీసుల పక్షపాత ధోరణితోనే నాగరాజును విడిచి పెట్టారనేది ఆమె వాదన. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్పై దాడి చేయడమే గాకుండా తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మొత్తానికి సదరు వివాహిత వీరంగంతో కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు.