వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూరత్ వజ్రాల వ్యాపారి ఉదారత: 251 మంది యువతులకు సామూహిక వివాహాలు
సూరత్: సూరత్ వజ్రాల వ్యాపారి ఒకరు తన మంచితనాన్ని చాటుకున్నారు. తండ్రి లేని, పేదలైన 251 మంది సూరత్ యువతులకు సామూహిక వివాహం జరిపించారు. గత వారం ఈ పెళ్లి జరిగింది.
గత ఐదేళ్లుగా ఆయన వేలాది మందికి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఈ ఏడాది తన పీపీ సవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 251 మంది వివాహాలు జరిపించారు.
2012 నుంచి ఆయన కన్యాదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి కన్యాదానం చేశారు. ఈ ఏడాది 22వ తేదీ నుంచి మెహందీ కార్యక్రమం ప్రారంభమైంది.
కేవలం హిందూ యువతులకే కాకుండా ఇతర మతాల పేద యువతులకు కూడా ఆయన పెళ్లిళ్లు జరిపించడం గమనార్హం. ఈ ఏడాది జరిపిన 251 మంది యువతుల పెళ్లిళ్లలో ఐదుగురు ముస్లీం, ఒకరు క్రైస్తవ యువతి ఉన్నారు.
Comments
English summary
PP Savani education Trust has taken up the responsibility of getting 251 girls married in a mass marriage function organised in Surat. Owner of the trust, Surat based businessman Mahesh Savani, is well known for adopting financially unstable fatherless girls and bearing expenses of their marriage.
Story first published: Monday, December 25, 2017, 21:38 [IST]