మోడీ జోరు!: ఎన్నికలముందు లాలూ-నితీష్లకి షాక్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మిత్రబృందానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర మండలి ఎన్నికల్లో 24 సీట్లకు గాను ఎన్డీయే 14 సీట్లు గెలుచుకుంది.
అధికార జెడియూ 5 సీట్లు, ఆర్జేడి 3 సీట్లు గెలుచుకుంది. జెడియు, ఆర్జేడీ రెండు కలిపి ఎనిమిది సీట్లే గెలుచుకున్నాయి. మిగతా రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు.
గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రిట్లాల్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అతను పాట్నా స్థానం నుండి గెలుపొందారు. ఇతను ఆర్జేడీకి సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది.
నేటి ఫలితాలు లాలూ, నితీష్ మిత్రబృందానికి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపిని, ప్రధాని మోడీని దెబ్బతీసేందుకు లాలూ, నితీష్ ఒక్కటయ్యారు. కానీ వారుకు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక్లలో చేదు అనుభవం కలిగింది.