చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న బెంగళూరు..: నేడు చెన్నై పార్కింగ్‌లో భారీ ప్రమాదం, 175కు పైగా కార్లు దగ్ధం

|
Google Oneindia TeluguNews

చెన్నై: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎయిర్ షోలో ఘోర అగ్ని ప్రమాదంలో వందలాది కార్లు దగ్ధమైన ఘటన మరవకముందే చెన్నైలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నగర శివారులోని పోరూర్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో సుమారు 175కు పైగా కార్లు దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న ఓ ప్రయివేటు పార్కింగ్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

PM Narendra Modi honours Safai Karmacharis by washing their feet at Prayagraj Kumbh

పోరూరులోని రామచంద్ర ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన కార్లను పార్కింగ్ చేసే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కెమికల్ వ్యర్థాల డంపింగ్‌ యార్డులో మంటలు అంటుకుని ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటలు కార్ల పార్కింగ్‌ ప్రాంతం వరకు వ్యాపించాయి. డంపింగ్‌ యార్డ్‌లో చెరుకు పిప్పి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

English summary
More than 175 cars were gutted this afternoon after a fire engulfed a parking lot on the outskirts of Chennai. The blaze may have spread due to dry grass catching fire, fanned by winds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X