తల్లీ-బిడ్డా క్షేమం: నిండు గర్భిణీని మోసుకెళ్లిన పోలీసు అధికారి, ప్రశంసలు
మధుర: ప్రసవ వేధన పడుతున్న నిండు గర్భిణిని ఓ పోలీసు అధికారి చేతుల్లో మోసుకెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మధురలో జరిగింది. సదరు పోలీసు అధికారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని సదరు అధికారి అమాంతం తన చేతుల్లో ఆసుపత్రిలోకి మోసుకెళ్లాడు. ఆయన సరైన సమయంలో వారిని తీసుకెళ్లడంతో ఆమె, కొత్తగా పుట్టిన పసిపాప క్షేమంగా ఉన్నారు.
ఈ సంఘటన సెప్టెంబర్ 14వ తేదీన జరిగింది. ఆ పోలీసు అధికారి పేరు సోను కుమార్. ఇతను మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
అతను కోర్టుకు వెళ్తుండగా ఓ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండటాన్ని గమనించారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. కానీ అది త్వరగా రాలేదు. దీంతో అతను వెంటనే ఆ మహిళను ఈ-రిక్షాలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోకి మోసుకెళ్లారు.
దీనిపై కుమార్ మాట్లాడుతూ... తాను ఆ మహిళను చూసి, సహాయం కోసం అంబులెన్స్కు ఫోన్ చేశానని, కాని అది అందుబాటులోకి రాలేదని, ఇక చేసేది లేక నిండు గర్భిణ్ని ఆసుపత్రిలోకి మోసుకెళ్లానని చెప్పారు. ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.