భార్యభర్తల బెడ్రూం రికార్డ్, మ్యారేజ్ బ్యూరో ఓనర్ అరెస్టు
తన వద్ద పని చేసే దంపతులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసిన మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది.
చెన్నై: తన వద్ద పని చేసే దంపతులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసిన మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది.
క్రోంపేట్కు చెందిన కదిరేశన్ వలసరవక్కంలో మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఏడాది కిందట తంజావూరుకు చెందిన దంపతులను పనిలో పెట్టుకుని తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించాడు.
వీరికి వేతనం కింద ఇచ్చిన చెక్కును డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో తగిన డబ్బు లేదని సమాధానం వచ్చింది. ఇదే విషయం కతిరేశన్ను ఆ దంపతులు అడిగారు.
దీంతో అతను వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. వారు బెడ్రూమ్లో సన్నిహితంగా ఉన్నప్పుడు తాను రికార్డ్ చేసిన దృశ్యాలను బయటపెడతానని బెదిరించాడు.
కేదిరేశన్ తమ బెడ్రూమ్లో కెమెరాలను ఏర్పాటు చేసి ఏప్రిల్ నుంచి తాము సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అది నిజమని తేలింది. దీంతో అతనిని అరెస్టు చేశారు.