ఆరేళ్ల మైనర్ బాలికను బెల్టుతో కొట్టిన మదర్సా టీచర్.. కేసుతో జైలుపాలు
ఢిల్లీలోని నోయిడాలో ఆరేళ్ల మదర్సా విద్యార్థిని చదవడం లేదని బెల్టుతో కొట్టినందుకు టీచర్ జైలు పాలయ్యాడు. విద్యార్థిని పై దెబ్బలు చూసిన తండ్రి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. దీంతో విచారణ సేసిన పోలీసులు కేసు బుక్ చేశారు.
ఢిల్లీ నోయిడాలో మదర్సాలో చదువుతున్న ఆరేళ్ల విద్యార్థిని మదర్సాలోని మౌల్వి చితకబాదాడు. విద్యార్థిని చదువుకోకపోవడంతో పాటు టీచర్ను ఇబ్బందులు పెట్టడడంతో, నవాజ్ అనే మౌల్వి ఆ విద్యార్థిని బెల్టుతో చితక భాదినట్టు పోలీసులు తెలిపారు. అయితే టీచర్ కొట్టినా విద్యార్థిని మాత్రం తల్లిదండ్రులకు చెప్పలేదు.కాని విద్యార్థిని చూసేందుకు వచ్చిన తండ్రి దెబ్బలను చూశాడు.
వీపుపైన వాతలు ఉండడంతో గమనించిన తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్ లో మౌల్విపై కేసు పెట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మొత్తం పదిమంది పిల్లలను కర్రతో బాదినట్టు తేలింది..అయితే విషయం తెలుసుకున్న మౌల్వి పోలీసులకు నుండి తప్పించుకుని రెండు రోజుల పాటు వెళ్లాడు. అనంతరం మదర్సాకు వచ్చిన మౌల్విని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే విద్యార్థిని చదువక పోవడంతోపాటు ఇబ్బందిపెట్టిందని చెప్పిన మౌల్వి..జరిగిన సంఘటనపై క్షమాపణ చెప్పాడు.. కాని మౌల్విపై పోలీసులు నాన్ కాగ్నిజబుల్ కేసును పెట్టారు. అనంతరం కోర్టులో హజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించినట్టు స్టేషన్ హౌస్ ఆఫిసర్ అగర్వాల్ తెలిపాడు.