‘మ్యాక్స్లైఫ్’ మహిళా ఎగ్జిక్యూటివ్ మిస్సింగ్
గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్ మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా విధులు నిర్వహిస్తున్న తనూ ప్రభాకర్(29) అనే మహిళ రెండ్రోజుల క్రితం అదృశ్యమైంది.
ఫిబ్రవరి 17న ఆఫీస్కు వచ్చిన ఆమె భోజన విరామ సమయంలో బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనబడకుండా పోయిందని సహోద్యోగులు తెలిపారు. ఆమె ఫోన్కు కాల్ చేశామని, అయితే ఎలాంటి సమాచారం లేదన్నారు.
దీంతో వారు ఆమెకు ఈ మెయిల్ పెట్టగా.. అత్యవసర పనిమీద కొద్ది రోజులు ఊరు వదలి వెళ్తున్నట్లు తనూ బదులు ఇచ్చినట్లు సహోద్యోగులు చెప్పారు. కాగా, ఆమె అదృశ్యంపై తనూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
తనూ స్నేహితుడు ప్రిన్స్ పాఠక్ అనే వ్యక్తిపై వారు ఫిర్యాదు చేశారు. అతడే తనూను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఇటీవల స్నాప్డీల్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని ఆమెను ప్రేమిస్తున్న వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమెకు ఎలాంటి హాని కలిగించకుండా వదిలిపెట్టడంతో కంపెనీ, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత కిడ్నాప్నకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.