మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్
భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఆయన ఆసాధరణ విజయం సాధించారని ఆయన కొనియాడారు.
మే 23 మోడీ దివస్
ఈనేపథ్యంలో ఫలితాలు వెలువడని మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. మొత్తం దేశంతోపాటు ప్రత్యేకంగా హర్యాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర్రాల్లో ఘననీయమైన గెలుపు సాధించారని ఆయన పేర్కోన్నారు. దీంతో దేశ ప్రజలందరు మోడీ చేతిలో సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు.ఉత్తరా ఖండ్లో విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గోన్నారు.
ముగ్గురు సంతానంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్
కాగా ఆయన ఆదివారం కూడ ముగ్గురు సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రాందేవ్ బాబా కులమతాలకు సంబంధలం లేకుండా ముగ్గురు సంతానం ఉన్న కుటుంభాలపై చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వారికి ఓటు హక్కు లేకుండా చూడడంతోపాటు ప్రభుత్వ ఫలితాలను కూడ అందకుండా చేయాలని ఆయన అన్నారు.దీంతోపాటు మరో యాబై సంవత్సరాల వరకు జనాభా 150 కోట్లకు మించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టానలి కోరారు.
గొవధ నిషేధంపై చర్యలు చేపట్టాలి...
జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించలేదని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే జనాభా పెరుగుదలపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.జనాభా నియంత్రణ మతంతో సంబంధం లేకుండా పాటించాలని ఆయన కోరారు.మరోవైపు సంపూర్ణ గోవధ నిషేధం కూడ చేపట్టాలని ఆయన కోరారు.దీంతో రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. గో సంరక్షణ సమితితోపాటు గోవులను స్మగ్లింగ్ చేసే ముఠాలకు చెక్ పెట్టవచ్చని ఆయన అన్నారు.