స్మృతి ఇరానీ ఇచ్చే డిగ్రీ నాకు అక్కర్లేదు: విద్యార్థి షాక్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పర్యటనకు ముందే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ విద్యార్థి షాకిచ్చాడు. కేంద్రమంత్రి సోమవారం ఇస్లామిక్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నుంచి ఓ ఎంబీఏ విద్యార్థి పట్టా తీసుకోబోనని ఓ విద్యార్థి ప్రకటించాడు. స్మృతీ చేతుల మీదుగా ఇచ్చే డిగ్రీ తనకు అక్కర్లేదని అతను స్పష్టం చేశాడు. కాశ్మీర్లోని ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి బ్యాచ్లో సమీర్ గోజ్వారీ అనే యువకుడు ఎంబీఏ చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
ఓ విద్యార్థిగా మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం కంటే ఆనందం ఇంకోటి ఉండదని, కానీ సోమవారం జరిగే స్నాతకోత్సవంలో ఇచ్చే ఆ పట్టా నాకు అక్కర్లేదని సమీర్ తెలిపాడు. ఈ కార్యక్రమానికి స్మృతీ హాజరవుతారా? లేదా? అన్న విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆమె సెంట్రల్ యూనివర్శిటీ కాశ్మీర్ కాంప్లెక్స్కు గండేర్బల్లో శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం నాడు జరిగే ఇస్లామిక్ వర్శిటీ తొలి స్నాతకోత్సవానికి ఓ కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా వస్తారని సమాచారం ఉండటంతో ఈ కార్యక్రమానికి కూడా స్మృతీ వస్తారని భావిస్తున్నారు.