తీవ్ర ఈవ్ టీజింగ్: వైద్య విద్యార్థిని ఆత్మహత్య
లక్నో: వేధింపుల కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్నగర్ ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అమెను ఓ యువకుడు వేధిస్తున్నాడని.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.
ఈ నేపథ్యంలో స్థానికంగా ఎంబీఏ చదివే అజయ్ విశ్వకుమార్ అనే యువకుడిపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెపై యాసిడ్ పోస్తానంటూ అజయ్ బెదిరించాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.