సాధ్వి ప్రగ్యపై వివాదాస్పద కామెంట్స్ చేసిన ముఫ్తి.. మేము టెర్రరిస్టులను పోటిలోకి దింపితే... ?
నేడు బీజేపీలో చేరి మధ్యప్రదేశ్ లోని బోపాల్ నియోజకవర్గం నుండి సాధ్వి ప్రాగ్యా ను పోటికి దింపుతున్న బీజేపిపై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబుబా ముఫ్తి విరుచుకపడ్డారు. తీవ్రవాదులకు మతం లేదన్న బీజేపీ , మాలేగావ్ బాంబు పేలుళ్ల అరెస్టైన సాధ్వి ప్రగ్యాను ఎలా పోటిలో దింపుతున్నారని ఆమే బీజేపీ ని ప్రశ్నించారు.
బీజేపీ తీర్థం పుచ్చుకున్ సాధ్వి ప్రగ్యా
ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సాధ్వి ప్రగ్యా బోపాల్ నుండి పోటి చేస్తుండడంపై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబుబా ముఫ్తి విమర్శలు సంధించారు. తీవ్రవాదానికి మతం లేదని చెప్పిన బీజేపీ తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని పోటిలోకి దింపడం పై ఆమే ప్రశ్నించారు. అదే మహబుబా ముఫ్తి ఇలాంటీ ఆరోపణలు ఎదుర్కోంటున్న వారిని పోటీలోకి దింపితే మీడియాతో పెద్ద ఎత్తున ప్రచారం చేసేదని అన్నారు. అదే కాషాయ పార్టీకి చెందిన వారు పోటిలో ఉంటే మాత్రం ఇలాంటీ ప్రచారాలు ఉండవని చెప్పింది. బీజేపీ సిద్దంతం ప్రకారం ముస్లింలందరు టెర్రరిస్టులే చెబుతారని అన్నారు.కాని ఇతరులకు ఈ సిద్దాంతం వర్తించదా అని అన్నారు.
మాలేగావ్ బాంబు పేలుళ్లలో అరెస్టైన సాధ్వి
కాగా సాద్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ 2008 లో మహరాష్ట్ర మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ లో కేసులో కీలక సూత్రదారి ఆరోపణలు ఎదుర్కోని అరెస్టయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు జైళ్లో ఉంది. అయితే అనంతరం ఎన్ఐఏ ఆమేకు క్లీన్ చీట్ ఇచ్చింది. కాగా కేసును విచారిస్తున్న ట్రయల్ కోర్టు మాత్రం కేసును తప్పించేందుకు అంగీకరించలేదు.
బీజేపీకి, బోపాల్ కంచుకోట , కాంగ్రెస్ నుండి బరిలో దిగ్విజయ్ సింగ్
భోపాల్ నియోజకవర్గానికి 1989 నుండి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఈసారి కూడ బోపాల్ లో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ ను బరిలోకి దింపింది.దీంతో ఈ ఎన్నికను పత్రిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతికింది.దీంతో ఉమా భారతీతోపాటు మాజి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేర్లను పరిశీలించింది చివరకు సాధ్వి ప్రగ్యా పేరును ఖరారు చేసింది.