టిక్టాక్, హలో యాప్లను ఎందుకు నిషేధించకూడదో చెప్పాలంటూ కేంద్రం నోటీసులు...
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పోందిన టిక్టాక్తోపాటు హలో యాప్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్దమయింది. ఈ యాప్లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారయని ఆరోపణలు చేస్తూ ... వాటికి సరైన సమాధానాలు ఇవ్వాలని కేంద్రం ఆయా సంస్థలకు హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం విడుదల చేసిన ఒకవేళ సరైన వివరణ ఇవ్వకపోతే..రెండు యాప్లను నిషేధిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విభాగంలోని సైబర్ చట్టాలు, ఈ సెక్యూరిటి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే యాప్ సంస్థలకు 21 ప్రశ్నలతో కూడిన నోటీసులను జారీ చేశారు. ముఖ్యంగా ఈ యాప్ వినియోగదారుల యొక్క సమాచారాన్ని ఇతర దేశాలకు గాని,ప్రైవేటు వ్యక్తులకు గాని బదీలీ చేయకుండా హామీ ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. మరోవైపు 18 ఏళ్లలోపు ఉన్న మైనారిటి తీరని పిల్లలను ఈ యాప్ నుండి నిషేధించాలని తెలిపింది.ఇక రాజకీయ ప్రకటనల కోసం హలో యాప్ సుమారు 11000 మార్ఫింగ్ చేసిన ప్రకటనల కోసం ఈ యాప్లు డబ్బులను ఖర్చు పెట్టాయని వచ్చిన వార్తలపై కూడ సమాధానం చెప్పాలని నోటిసులో పేర్కోంది.
కాగా ఈ యాప్లు జాతీ వ్యతిరేక కార్యకలపాలకు కేంద్రంగా మారాయని ,దీనిపై విచారణ చేసి నిషేధం విధించాని స్వదేశీ జాగరణ మంచ్ కో కన్వినర్ అశ్వని మహాజన్ కేంద్రానికి గతంలో లేఖ రాశారు.