బాలికపై గ్యాంగ్ రేప్: ట్యాంకర్ దూసుకెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేను నమోదు చేసుకుని పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. గుట్టపల్లికి చెందిన బాలికపై పదిహేను రోజుల క్రితం మిర్యాలగుడాకు వచ్చింది. ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇదిలావుంటే, వాటర్ ట్యాంకర్ కింద పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ప్రాజెక్టుల పని మీద వెళ్లి స్నేహితురాలితో కలిసి ద్విచక్రవాహనంపై తిిరగి వస్తుండగా బాసింగ స్లాఖ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సికింద్రాబాదులోని మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాదులని నాగారం ప్రాంతానికి చెందిన బాసంగి సాఖ్య రంగారెడ్డి జిల్లా చేర్యాలలోని గీతాంజలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. ప్రాజెక్టు వర్క్ నిమిత్తం సికింద్రాబాదులోని ప్యారడైజ్ సమీపంలోని స్నేహితురాలి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉప్పరిగుడా వద్దకు రాగానే వెనక నుంచి వచ్ిచన జల మండలి ట్యాంకర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
వాహనం వెనక కూర్చున్న స్లాఖ్య పైనుంచి ట్యాంకర్ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. స్లాఖ్య తండ్రి సురేష్ బాబు హైదరాబాదులోని ఆబిడ్స్ తపాలా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ సూపరింటిండెంట్గా పనిచేస్తున్నారు.