బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో పిల్లర్ కూలింది: ఆ ప్రచారం అవాస్తవం, తేల్చిన పోలీసులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. నగరంలోని మైసూర్ రోడ్డులో ఓ పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ప్రచారం కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అయితే ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారమైంది.అసలు ఎక్కడ కూడ మెట్రో పిల్లర్ కూలిపోలేదని పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తమని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఈ ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు.

Metro pillar collapse rumor spreads panic in Bengaluru

నగర శివారులోని నయందహళ్లిలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లరును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పిల్లర్‌ కొంత మేర దెబ్బతింది. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండానే కొందరు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు.

పిల్లర్ కూలిపోయిందని పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు, మెట్రో అధికారులు అవి వదంతులు మాత్రమేనని, నమ్మవద్దని కోరారు.

English summary
Panic gripped Bengaluru on Tuesday night after a video circulating on Whatsaap showed a metro pillar collapsing on Mysuru Road. In fear, people started calling their friends and relatives living in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X