భారత్తో యుద్దానికి అమెరికానే కారణం: చైనా
డోక్లామ్లో ఉద్రిక్తతల నడుమ భారత్కు మద్దతిస్తూ అమెరికన్ మీడియా ప్రచురించిన ఆర్టికల్పై చైనా విరుచుకుపడింది.
న్యూఢిల్లీ: డోక్లామ్లో ఉద్రిక్తతల నడుమ భారత్కు మద్దతిస్తూ అమెరికన్ మీడియా ప్రచురించిన ఆర్టికల్పై చైనా విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య యుద్దం వస్తే అమెరికానే కారణమని కూడ చైనా మీడియా ఆరోపణలు చేసింది.
భారత్-చైనాల మధ్య యుద్దం వస్తే అందుకు అమెరికానే కారణమని చైనా మీడియా ఆరోపణలు గుప్పించింది. అమెరికాకు చెందిన వాష్టింగ్టన్ 'ఎగ్జామినర్' తన ఎడిటోరియల్ కాలమ్లో 'ట్రంప్ మస్ట్ సపోర్ట్ ఇండియా అగెనెస్ట్ చైనా' అనే శీర్షిక పేరిట కథనాన్ని ప్రచురించింది.
అమెరికా ఎందుకు మద్దతివ్వాలో వివరిస్తూ దేశానికి వ్యతిరేకంగా తయారౌతున్న చైనాను అడ్డుకొనేందుకు అమెరికా భారత్కు మద్దతివ్వాలని సూచించింది.
ఈ కాలమ్ను చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్టైమ్స్ తప్పుబట్టింది. సమస్య ఎక్కడుంటే అక్కడ అమెరికా తలరూరుస్తోందని ఆ పత్రిక ఆరోపణలు చేసింది.
సమస్యలు తీర్చాలంటే నిష్ఫక్షపాత ధోరణి ఉండాలని ఆ పత్రిక సూచించించింది. అమెరికా మాత్రం భారత్-చైనాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేసింది. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడ తెరమీదికి తెచ్చి ప్రస్తావించింది.
అమెరికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నానన్న ఉద్దేశం చైనా కాలమ్లో కన్పించింది. దక్షిణ చైనా సముద్రంలో కూడ అనవసర జోక్యం ప్రమాదకరమని అమెరికాను హెచ్చరించింది.