జమ్మూ లో కూలిపోయిన మిగ్ -21 ఫైటర్
శ్రీనగర్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిగ్ - 21 కూలిపోయింది. శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం కూలిపోయిందని భారత వైమానిక అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఈ విమానం కూలిపోయింది.
సాధారణ శిక్షణలో భాగంగా శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి యుద్ధ విమానం బయలుదేరింది. అయితే కొద్ది సేపటికి బడ్గావ్ జిల్లాలోని సోయిబుగ్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. అయితే పైలెట్ సురక్షితంగా తప్పించుకున్నాడు.
విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పైలెట్ ను సురక్షితంగా ఆర్మీ హెలికాప్టర్ ద్వారా బేస్ క్యాంపస్ కు తీసుకొచ్చామని ఆర్మీ అధికారులు తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ -21 యుద్ధ విమానాలు 40 ఏళ్లుగా భారత వైమానిక దళంలో కొనసాగుతున్నాయి.
అయితే ఇప్పటికే పలు ప్రమాదాలలో పలు మిగ్ -21 విమానాలు కుప్ప కూలిపోయాయి. శ్రీనగర్ లో విమానం కూలిపోవడానికి గల కారణాలపై ఆర్మీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
IAF
aircraft
crash
in
Budgam(J&K):
Visuals
from
the
spot
pic.twitter.com/pgpvXlehdX
—
ANI
(@ANI_news)
August
24,
2015
First
visuals
from
the
spot
where
Army
helicopter
crashed
in
Budgam(J&K).
Pilot
ejected
safely
pic.twitter.com/08bFZWHj5a
—
ANI
(@ANI_news)
August
24,
2015