వలస కూలీలకు ఊరట: స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి.. కానీ వైద్య పరీక్షల తర్వాతే...
మహారాష్ట్రలో చెరకు ప్రధాన పంట. ఇక్కడ పండే పంట కోత కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష 31 వేల మంది కూలీలు ఉన్నారు. అయితే కరోనా వైరస్ దెబ్బకు ఫ్యాక్టరీల్లో పనిచేయడం దేవుడేరుగు.. తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకొంటే వారికి చుక్కెదురైన సంగతి తెలిసిందే.
దీంతో కూలీల సమస్యను కూడా ఆలోచించి వారిని సొంత రాష్ట్రానికి పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ముందు వారికి వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి అని పేర్కొన్నది. రాష్ట్రంలో గల 38 ఫ్యాక్టరీలో లక్ష 31 వేల మంది కూలీలు పనిచేస్తున్నారి మంత్రి ధనంజయ్ ముండే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సర్క్యులర్ కూడా షేర్ చేశారు.
దీంతో బీడ్, అహ్మదనగర్ చక్కెర కూలీలకు మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అయితే సదరు ఫ్యాక్టరీలు కూలీలకు గ్రామ పంచాయతీల్లో పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈ క్రమంలో కూలీలు ఆహారం, వసతిని సదరు ఫ్యాక్టరీలు కల్పించాలని స్పష్టంచేశారు.