ఆకలి కేకలు: రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకేట్లను ఎత్తుకెళ్లిన వలస కూలీలు(వీడియో)
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, వారికి ఆహారం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
Recommended Video
కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నర్మదాపురం డివిజన్ రైల్వే స్టేషన్కు శ్రామిక్ ప్రత్యేక రైలు ఎక్కేందుకు వలస కార్మికులు వచ్చారు. ఆ రైలులో ప్రయాణించే వలస కూలీలకు అందించడానికి ప్యాక్ చేసిన ఆహారం, బ్రెడ, వాటర్, తదితర ఆహార పదార్థాలు అధికారులు ఒక ట్రాలీలో తీసుకొచ్చారు.
అది చూసిన వలస కూలీలు దాని చుట్టూ గుమిగూడారు. రైలు ప్రయాణ సమయంలో ఇవ్వడానికి తెచ్చిన ఆహారమని ఇప్పుడు ఇవ్వమని అధికారులు చెప్పినా వినకుండా.. ఒకరిద్దరు కూలీలు ధైర్యం చేసి ఆ ఆహారం ప్యాకేట్లను తీసుకున్నారు. ఇక మిగిలిన కూలీలు కూడా ట్రాలీపై పడి దొరికిన ఆహారాన్ని లాక్కునిపోయారు.
A video of Itarsi Railway Station in has gone viral, wherein #MigrantWorkers travelling on 1869 #ShramikSpecialTrain could be seen looting food packets on Sunday morning @ndtv #covid1948 #Covid_19india #coronavirus #lockdown pic.twitter.com/91gArNIAUD
— Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2020
ఒకరి చేతిలో ఉన్న ఆహారాన్ని మరొకరు తీసుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పలువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో అధికారులంతా పక్కకు జరిగిపోయారు. రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కూడా లేకపోవడంతో కూలీలంతా తమకందిన ఆహారప్యాకేట్లను పట్టుకెళ్లారని అధికారులు తెలిపారు. కాగా, ఇలాంటి ఘటనలు ఇటీవల పలుచోట్ల చోటు చేసుకున్న విషయం తెలిసిందే.