వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షాపై కాంగ్రెస్ మండిపాటు .. వాయుసేన దాడులను రాజకీయం చేస్తున్నారని మండిపాటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్ర మూకలు చేసిన దాడికి ప్రతీకారంగా వైమానిక దళం చేసిన దాడులకు రాజకీయ రగడ కొనసాగుతోంది. బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరంపై దాడిచేశాక స్వయంగా విదేశాంగ ప్రకటన చేస్తూ .. ఉగ్రవాదులు, శిక్షణ ఇచ్చేవారు .. తదితరులు మృతిచెందారని పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్దంగా బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడటంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధానికి కారణమైంది.

250 మంది ఉగ్రవాదులు చనిపోయారా ?

250 మంది ఉగ్రవాదులు చనిపోయారా ?

బాలకోట్ లో వాయుసేన చేసిన దాడిలో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆదివారం అమిత్ షా వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. పుల్వామాలో 40 మంది జవాన్లు చనిపోయినందుకు ప్రతీకార చేపట్టిన వాయుసేన దాడులను రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించింది. ఐఏఎఫ్ చెప్పినదానికి .. అమిత్ షా చెప్పినదానికి పొంతనే లేదన్నారు కాంగ్రెస్ నేత మనీశ్ తివారి. వైమానిక దళ దాడులను మీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏంటని నిలదీశారు.

మృతులకు సంబంధించి ఆధారాలేవీ ?

మృతులకు సంబంధించి ఆధారాలేవీ ?

ఇటు మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కూడా ధ్వజమెత్తారు. వైమానిక దళం చేసిన దాడిని ... రాజకీయాల కోసం వాడుకోవడం ఏంటని మోదీని ప్రశ్నించారు. మరోవైపు బాలకోట్ దాడుల్లో ఉగ్రవాదులు చనిపోయినట్టు ఆధారాలు ఏం దొరకలేదని విదేశీ మీడియా కోడై కూస్తుందని పేర్కొన్నారు.

మృతుల ఘటనను హోంశాఖ ఖండించింది : చిదంబరం

మృతుల ఘటనను హోంశాఖ ఖండించింది : చిదంబరం

మరోవైపు మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ఉగ్రవాదులు 350 మంది వరకు చనిపోయారని వార్తలొచ్చాయన్నారు. ఉగ్రవాదుల మృతికి సంబంధించి ఆధారాలేంటీ ? అధికార పార్టీ ఎలా నిర్ధారించిందని సూటిగా ప్రశ్నించారాయన. అలాగే 350 మంది ఉగ్రవాదులు, లేదంటే పౌరులు చనిపోయారనే అంశాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిందనే విషయాన్ని ట్వీట్ చేశారు. ఓ సాధారణ పౌరుడిగా ప్రభుత్వం చెప్పే అంశాన్ని గౌరవిస్తావని, అయితే ఈ అంశాలను ప్రపంచం కూడా చూస్తోందని, ..యావత్ జాతి విశ్వసించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం చెప్పే ప్రతి అంశం సునిశీతంగా నిర్ధారించుకున్నాకే .. ప్రకటించాలి తప్ప ... ఊరికే ప్రకటనలు చేయొద్దని సూచించారు.

English summary
Former Union Minister Manish Tewari accused Amit Shah on Monday of using India's airstrikes on Jaish-e-Mohammed for political gain, pointing to the BJP president's claim that more that 250 terrorists were killed in the operation. Made furious by a suicide bombing that killed 40 of its paramilitary personnel, India said last week it had carried out a pre-emptive strike on Jaish-e-Mohammed in Balakot, located in Pakistan's Khyber-Pakhtunkhwa province. A Ministry of External Affairs (MEA) statement made on the same day said a large number of terrorists had been eliminated. Later, the Indian Air Force said there was evidence that its jets had hit their intended targets but that it was premature to assess casualties. Manish Tiwari referred to the IAF's description of what unfolded in Balakot when he asked, of Amit Shah's remarks: "Is this not milking airstrikes for politics?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X