వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణ... కసరత్తు చేస్తున్న సీఎం
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన తర్వాత తర్వాత జరగబోయో పరిణామాలపై యడియూరప్ప దృష్టి పెట్టారు, ఈనేపథ్యంలో ముందుగా మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పడ్డట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనేపథ్యంలోనే వారం రోజుల్లో మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు బీజేపీకి చెందిన సీనియర్ నేతలు తెలిపారు. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో స్పికర్ను కూడ ఎంపిక చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ముగిసింది.విశ్వాస తీర్మాణంలో బీజేపీ నెగ్గడంతో రెండవ అంకానికి తెరలేచింది. ఈ నేపథ్యంలోనే వారంలో రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుందని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. కాగా మంత్రివర్గంలో ఎవరేవరిని తీసుకోవాలనే అంశంపై వారంతోలో ప్రకటన వెలువడనుందని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలోనే యడియూరప్ప డీల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఢీల్లీలో పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత ప్రకటించనున్నాట్టు తెలుస్తోంది.
ఇక స్పీకర్ రమేశ్ కుమార్ కూడ రాజీనామ చేయడంతో రెండు మూడు రోజుల్లోనే స్పీకర్ ఎన్నిక కూడ జరగనుంది. మరోవైపు రెబల్ ఎమ్మెల్యే విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నదీ ఆసక్తిగా మారింది. స్పీకర్ వేసిన అనర్హత వేటుపై ఇప్పటికే వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.