ఓటు వేయలేదని బాలికపై గ్యాంగ్రేప్, ఆమె హత్య
రాంచీ: జార్ఖండ్లో దారుణమైన సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తితో పాటు అతని సోదరులు సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను చంపేశారు. జార్ఖండ్లోని రాంచీ పంచాయతీ ఎన్నికల్లో ఆ బాలిక కుటుంబ సభ్యులు తన భార్యకు ఓటు వేయలేదనే కక్షతో ఆ వ్యక్తి ఆ దారుణానికి ఒడిగట్టారు.
హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం - బాలిక జనవరి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. బహిర్భూమికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు లిట్టిపరా పోలీసు స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు.
మర్నాడు బాలిక శవం సమీపంలోని అటవీ ప్రాంతంలో కనిపించింది. శుక్రవారంనాడు పోలీసులు నలుగురిని అరెస్టు చేసారు. ప్రేమ్లాల హన్సదా, అతని సోదురులు శామ్యూల్ హన్సదా, కత్తి హన్సదా, శిశు హన్సదాల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తన భార్యకు ఓటు వేయలేదనే కక్షతో తన కూతురిని హత్య చేశారని మృతురాలి తండ్రి ఆరోపించాడు. ప్రేమ్లాల్ భార్య సర్పంచ్ పదవికి పోటీ చేసింది. మృతురాలి కుటుంబ సభ్యులే తన భార్య ఓటమికి కారణమని ప్రేమ్లాల్ కక్ష పెంచుకున్నాడు.
దాంతో బాలికను అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆమె శవాన్ని బ్లేవాన్ అటవీ ప్రాంతంలో దాచి పెట్టారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.