తోడుగా పంపితే బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలికి గాయమైన ఓ విద్యార్థినిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లమని తోడుగా పంపిస్తే... ఆ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనితోపాటు అతని స్నేహితుడు కూడా ఆమె ఘాతుకానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్రాజ్ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో చదువుతోంది. మంగళవారం పాఠశాలలో ఉండగా.. ఆ బాలిక కాలికి గాయమైంది. దీంతో బాలికను ఇంట్లో దిగబెట్టి రమ్మని స్కూల్ ప్రిన్సిపల్ ఆ పాఠశాలలో వంటవాడిగా పనిచేస్తున్న భమ్రగద్ బంధు అనే వ్యక్తికి అప్పజెప్పారు.
ఈ క్రమంలో బంధు.. ఆ బాలికను తీసుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో తన స్నేహితుడు ప్రశాంత్ పిల్లారేతో కలిసి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై వారిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం బాలికను గ్రామంలో వదిలేసి పరారయ్యారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బంధు, అతడి స్నేహితుడు ప్రశాంత్ను గురువారం అరెస్టు చేశారు.