వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతిని కిడ్నాప్ చేసి రేప్: యాసిడ్ దాడితో హత్య

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రంలోని బాలంగిర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఆమెపై యాసిడ్ దాడి చేసి హత్య చేశారు.

కాగా, మృతురాలు ఇటీవలే పదో తరగతి పాసయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలికను శుక్రవారం ఉదయం దుండగులు కిడ్నాప్ చేశాడు. కాగా, శనివారం రాత్రి ఆమె ఓ కాలువ సమీపంలో శవమై కనిపించింది.

Minor girl raped, attacked with acid and murdered

ఆమె మొహం, మెడపై యాసిడ్ గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

English summary
A minor girl was allegedly raped and murdered by unidentified men who poured acid on her face apparently to stall investigation at Sargipalli in Balangir district of Odisha, police said here on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X