భార్య ఇంటిలో లేదు: భార్య చెల్లి మీద కన్ను వేశాడు, అనుకున్నది చేశాడు, చివరికి?
జైపూర్: ఇంటిలో ఒంటిరిగా ఉన్న మరదలి మీద బావ అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని కేశవాపురలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె అక్క భర్తను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కేశవాపుర పోలీసులు తెలిపారు.
హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె!
కేశవాపురలో గిరిరాజ్ మలి (23) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని భార్యకు 15 ఏళ్ల చెల్లెలు ఉంది. శనివారం భార్య ఇంటిలో లేని సమయంలో ఆమె సోదరి, గిరిరాజ్ మలి ఇద్దరే ఇంటిలో ఉన్నారు. ఆ సందర్బంలో మరదలి మీద అత్యాచారయత్నం చేశాడు.
బాలిక ఎదురు తిరగడంతో ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎంతో కాలంగా మరదలి మీద కన్ను వేసిన కామంధుడు చివరికి తన కోరిక తీర్చుకున్నాడు. ఇంటికి వచ్చిన అక్కకు బాలిక అసలు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్కో చట్టం కింద గిరిరాజ్ మలిని అరెస్టు చేశామని పోలీసు అధికారి సంజయ్ రాయ్ మీడియాకు చెప్పారు.