నా భార్య ఆచూకీ చెప్పరా ప్లీజ్!: చివరకు విషాదమే మిగిలింది..
తిరువనంతపురం: సంపూర్ణ ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వచ్చి అదృశ్యమైన విదేశీ యువతి కేసులో మిస్టరీ వీడింది. ఆమె మిస్టరీ విషాదాంతంగా మిగలడం భర్త ఆండ్రూని తీవ్ర శోకసంద్రంలో ముంచింది.
అంతులేని వ్యథ..: నా భార్య కనిపిస్తే చెప్పరా ప్లీజ్!..
కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తిరువనంతపురంలోని ఓ నది ఒడ్డున ఆమె మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డున ఉన్న పొదల్లో ఆమె మృతదేహం పడి ఉన్నట్టు మొదట కొంతమంది జాలర్లు తమకు సమాచారం అందించారని పోలీసులు చెప్పారు. హుటాహుటిన అక్కడికెళ్లగా.. కుళ్లిపోయిన స్థితిలో మొండాన్ని, మరి కొంచెం దూరంలో తలను గుర్తించామన్నారు.
కాగా, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి చికిత్స కోసం ఇండియా వచ్చిన లిగ స్క్రోమనే(33) అనే ఓ ఐరిష్ మహిళ మార్చి 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమెను వెతుక్కుంటూ ఇండియా వచ్చిన భర్త ఆండ్రూ.. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇప్పుడీ విషాద వార్త తెలియడంతో అతను దు:ఖంలో మునిగిపోయాడు.