వీడు తండ్రేనా?: పాలు తాగనందుకు అలాంటి శిక్షా? పాపం.. ఆ చిన్నారి ఏమైందో..
డల్లాస్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి పాలు తాగనందుకు ఓ మూర్ఖపు తండ్రి ఊహించని శిక్ష విధించాడు. దీంతో ఆ చిన్నారి కనిపించకుండా పోయింది.
టెక్సాస్ : డల్లాస్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి పాలు తాగనందుకు ఓ మూర్ఖపు తండ్రి ఊహించని శిక్ష విధించాడు. దీంతో ఆ చిన్నారి కనిపించకుండా పోయింది.
వెస్లీ మాథ్యూస్(37) కుటుంబం భారత సంతతికి చెందిన ఓ పాపను దత్తత తీసుకుంది. ఆ చిన్నారి పేరు షెరిన్, వయసు మూడేళ్లు. శనివారం రాత్రి కుమార్తె షెరిన్ పాలు తాగకపోవడంతో మాథ్యూస్ కు కోపం వచ్చింది.
దీంతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతడు తన కూతుర్ని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాడు. ఇంటికి దూరంగా ఓ చెట్టు కనిపించడంతో షెరిన్ ను అక్కడికి తీసుకెళ్లి, తెల్లవారే వరకూ అక్కడే నిలబడమని ఆదేశించి తిరిగి ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.
ఓ పావుగంట తరువాత చూస్తే... ఆ చెట్ట దగ్గర షెరిన్ కనిపించలేదు. దీంతో ఆ చిన్నారి కోసం చుట్టుపక్కల చాలాసేపు వెతికారుగానీ ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
జరిగినదంతా తెలుసుకున్న పోలీసులు చిన్నారి అదృశ్యానికి కారణమైన మాథ్యూస్ అరెస్టు చేసి, అనంతరం ఓ బాండ్పై విడుదల చేశారు. ఈ ఘటనపై స్పందించేందుకు మాథ్యూస్ నిరాకరించాడు.