నేనున్నాంటూ చిదంబరానికి మద్దతు.. డీఎంకే చీఫ్ భరోసా..!
ఆయనొక కేంద్రమంత్రి పది సంవత్సరాలపాటు పాటు హోంమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా దేశానికి సేవలు అందించారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కాని ప్రజలకు భాద్యత వహించాల్సిన నేత కొడుకు కోసం ఇబ్బందుల్లో పడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. చట్టానికి ఎవరు చుట్టాలు కాకపోయిన, ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అప్పుడు శాసించిన అధికార వ్యవస్థే ఇప్పుడు ఆయన్న పరుగులు పెట్టిస్తోంది.
దీంతో ఆయన ఇళ్లు విడిచి పారిపోయో పరిస్థితి నెలకొంది.. ఇంత జరుగుతున్నా దేశంలో ఉన్న బడా కాంగ్రెస్ నేతలు ముందుకు రాని పరిస్థితి, కాని స్వంత రాష్ట్రంతో పాటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తమిళనాడు నేతలు చిదంబరానికి మద్దతు పలికారు. ఇటివల తమిళనాడు ప్రజాబలాన్ని చేజిక్కుంచున్న డీఎంకే నేత స్థాలిన్ చిదంబారానికి మద్దతు పలికాడు. దీంతో కష్టాల్లో ఉన్న సమయంలో నిలిచిన స్టాలిన్ చిదంబరం అరెస్ట్కు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలపై మండిపడ్డారు.చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు సీబీఐ జరుపుతున్న ప్రయత్నాలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్టాలిన్ సమాధానమిస్తూ, చిదంబరం న్యాయ నిపుణుడని, ఆయన లీగల్గానే పరిస్థితులను ఎదుర్కోగలరని స్టాలిన్ అన్నారు.
మరోవైపు ఇది రాజకీయ కుట్రగా కాంగ్రెస్ పార్టీ అరోపణలు చేస్తోంది. ఇన్ని సంవత్సరాలు చిదంబరం దర్యాప్తు సంస్థలకు సహకరించారని, సోమవారం సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఆయన్ను పారిపోయారని చీత్రీకరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు..రాజకీయ కక్షతోనే ఆయన అరెస్ట్కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన అరెస్ట్ పై రాహుల్ ప్రియాంక గాంధీలు ఖండించారు. సాధరణంగా తమ నాయకులపై ఎలాంటీ కక్ష్య సాధింపు చర్యలకు పూనుకున్న దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చెలరేగే సంస్కృతి దేశంలో ఉండేది కాని ఇప్పుడు చిదంబరం విషయంలో మాత్రం కనిపించడం లేదు.