లోక్ సభ ఎన్నికలకు మేము రెఢీ, ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యం: హీరో కమల్ హాసన్!
చెన్నై: లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రముఖ బహుబాష నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో మా పార్టీ నాయకులు పోటీ చేస్తారని కమల్ హాసన్ చెప్పారు.
తమిళనాడులోని మధురైలో మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సన్నాహాలు మొదలు పెట్టామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ తన సత్తా చాటుకుంటుందని కమల్ హాసన్ జోస్యం చెప్పారు.
తమిళనాడులో జరిగే శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సిద్దంగా లేదని, ఆ ఉద్దేశం మాకు లేదని కమల్ హాసన్ ఇదే సందర్బంలో స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి, అన్నాడీఎంకే నాయకుడు ఏకే. బోస్ మరణించడంతో రెండు నియోజక వర్గాలు ఖాళీ అయ్యాయి.
తిరువారూర్, తిరుపనకుండ్రమ్ శాసన సభ నియోజక వర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమీషన్ ఇంకా ప్రకటించలేదు. శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు.