రాహుల్, అద్వానీ, కేజ్రీవాల్, కేంద్రమంత్రులకు పిలుపు: రాజ్థాకరే కొడుకు పెళ్లికి మోడీకి అందని ఆహ్వానం
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షులు రాజ్ థాకరే తన కూతురు పెళ్లికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులను ఆహ్వానించారు.
కానీ ప్రధాని నరేంద్ర మోడీకి ఇంకా ఆహ్వాన పత్రిక అందలేదు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అద్వానీ వంటి వారితో పాటు మోడీ కేబినెట్ మంత్రులకు కూడా ఆహ్వానం అందింది. రాజ్ థాకరే కొడుకు వివాహం ఈ నెల 27వ తేదీన లోయర్ పారెల్లోని రేగిస్ హోటల్లో జరగనుంది.
వీరికి ఆహ్వానం
రాజ్ థాకరే గత వారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆగిపోయారు. దీంతో తనకు అత్యంత సన్నిహితులైన హర్షల్ దేశ్పాండే, మనోజ్ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన, మేనకా గాంధీ, అద్వానీ, రాహుల్ గాంధీ తదితరులను ఆహ్వానించారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో వారు ఆయనను కలవలేకపోయారు.
ఆహ్వాన జాబితాలో లేని మోడీ పేరు!
అయితే అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు లేనట్లుగా ప్రచారం సాగుతోంది. మీ కుమారుడి పెళ్లికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తారా అని గత ఏడాది రాజ్ థాకరేను మీడియా ప్రశ్నించగా.. మోడీ పెళ్లి బంధాన్ని నమ్ముతారా అని అని ఎదురు ప్రశ్నించారు. అప్పుడే ఆహ్వానిస్తారా అనే చర్చ సాగింది.
గతంలో ఏం చెప్పారంటే?
కాగా, రాజ్ థాకరే తనయుడు అమిత్ థాకరే వివాహం ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ సంజయ్ బొరుడె కుమార్తె మిథాలితో జరగనుంది. ఒకప్పుడు రాజ్ థాకరే.. మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మోడీ ముక్త్ భారత్ అంటున్నారు.