రేప్, హత్య నిందితులను పిఎస్ నుంచి లాగి కొట్టి చంపేశారు
ఇటానగర్: అత్యాచారం, హత్య కేసులో నిందితులైన ఇద్దరిని గుంపు పోలీసు స్టేషన్ నుంచి బయటకు లాగి కొట్టి చంపేసింది. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోహిత్ జిల్లాలో సోమవారంనాడు జరిగింది.
ముప్పయేళ్ల సంజయ్ సోబర్, పాతికేళ్ల జగదీష్ లోహర్ అస్సాంలోని టీ ప్లాంటేషన్ వర్కర్స్. వారిని భారీ గుంపు పోలీసు స్టేషన్ నుంచి మార్కెట్ స్క్వేర్కు లాక్కొచ్చి పోలీసుల ఎదుటే వీధిలో చంపేశారు.
శవాలను మార్కెట్ ప్రాంతంలో పడేశారు. నిందితులను కాల్చేయడానికి గుంపు ప్రయత్నించింది. అయితే భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
ఫిబ్రవరి 12వ తేదీన వాక్రో పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామం నుంచి ఐదున్నరేళ్ల బాలిక అదృశ్యమైంది. నాంగో గ్రామం సమీపంలోని అడవిలో బంధువులు తల నరికి ఉన్న స్థితిలో బాలిక శవం రక్తం మడుగులో పడి ఉండడాన్ని చూశారు.
రేప్, హత్య కేసులో అనుమానితులుగా భావించి పోలీసులు ఆ తర్ావత సోబర్, లోహర్లను అరెస్టు చేశారు. నేరాన్ని వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆదివారంనాడు వారిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు పోలీసు కస్టడీ విధించింది.
వారిద్దరని చంపిన కేసులో గుర్తు తెలయని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంపు అదుపు చేయడంలో విఫలైన ముగ్గురు పోలీసులు సస్పెండయ్యారు. లోహిత్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ బదిలీ అయ్యారు.