వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ మిస్డ్ కాల్స్ కాలం: ఈ అర్ధరాత్రి నుంచే.. !

|
Google Oneindia TeluguNews

ముంబై: భూమి గుండ్రంగా ఉందనడానికి కోకొల్లలుగా ఉదాహరణలను చెబుతుంటారు పెద్దలు. ఇదీ అలాంటి వ్యవహారమే. దేశంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో కాల్ ఛార్జీలు, వాటి రేట్లు ఎంత కాస్ట్లీగా ఉండేవో బహుశా ఎవరూ మరిచిపోయి ఉండరు. అందుకే- ఒకటి లేదా రెండు రింగులు ఇచ్చేసి కట్ చేసిన వాళ్లు మనలో చాలామందే ఉంటారు. కాల్ టారిఫ్ రేట్లకు భయపడి మిస్డ్ కాల్స్ తో సరి పెట్టుకోని వారు ఉండకపోవచ్చు.

బీచ్ లో కలకలం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్ కేసులో మృతదేహం.. ముక్కలుగా నరికిన వైనం..!బీచ్ లో కలకలం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్ కేసులో మృతదేహం.. ముక్కలుగా నరికిన వైనం..!

డంగైపోయేలా కాల్ టారిఫ్..

డంగైపోయేలా కాల్ టారిఫ్..

అదే పరిస్థితి మళ్లీ పుట్టుకొచ్చింది.. భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోయే మొబైల్ టారిఫ్ రేట్ల లిస్ట్ చూస్తే.. గుండె జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పట్లాగా ఏకధాటిగా మొబైల్ ఫోన్లలో కబుర్లు చెప్పుకొంటూ, వీడియోలను తిలకించడం ఇక పెను భారంగా మారింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో.. ఆయా సంస్థలన్నీ తమ కాల్ టారిఫ్ ను భారీగా పెంచేశాయి. ఎంత భారీగానంటే 50 శాతం మేరకు పెంచాయి. పెంచిన టారిఫ్ ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

అయిదేళ్ల తరువాత మొదటి సారిగా..

అయిదేళ్ల తరువాత మొదటి సారిగా..

దేశంలో టాప్ మొబైల్ ప్లేయర్లు తమ కాల్ టారిఫ్ రేట్లను భారీగా పెంచడం అయిదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ సంస్థలు తమ కాల్ రేట్లను ఈ అర్ధరాత్రి నుంచి 50 శాతం మేర పెంచుబోతుండగా.. రిలయన్స్ జియో మాత్రం ఆరో తేదీ నుంచి 40 శాతం మేర పెంచబోతోన్నట్లు ఇదివరకే వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ కొత్త టారిఫ్ రేట్లు దాదాపు ఒకేలా ఉండొచ్చని తెలుస్తోంది.

ఏడాది ప్లాన్ ప్రకారం..

ఏడాది ప్లాన్ ప్రకారం..

వొడాఫోన్ ఐడియా ఏడాది వేలిడిటి ఉన్న ప్లాన్ ప్రకారం.. 1,499 రూపాయలను వసూలు చేయనున్నారు. అదే సమయంలో డేటా వినియోగం 12 జీపీలకు కుదించారు. ఇప్పటిదాకా ఈ ప్లాన్ 999 రూపాయల వరకే ఉండేది. అలాగే- డేటా 24 జీబీ వరకు వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఈ ప్లాన్ కాస్తా పెను భారంగా మారింది. భారతి ఎయిర్ టెల్ ఏడాది వేలిడిటి ఉన్న ప్లాన్ దాదాపుగా ఇలాగే ఉండొచ్చని చెబుతున్నారు.

వేల కోట్ల రూపాయల్లో నష్టం..

వేల కోట్ల రూపాయల్లో నష్టం..

వొడాఫోన్ ఐడియా సంస్థ కిందటి నెలలో 50, 921 కోట్ల రూపాయలను నష్టపోయిందనే వాదన టెలికం రంగంలో వినిపిస్తోంది. అటు వొడాఫోన్ గానీ, ఇటు ఐడియా గానీ స్వతంత్ర సంస్థలుగా కొనసాగినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున నష్టపోలేదని అంటున్నారు. భారతి ఎయిర్ టెల్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఆ సంస్థ 23,054 కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కాల్ టారిఫ్ రేట్లను పెంచినట్లుగా చెబుతున్నారు.

English summary
obile calls and internet charges will go up by up to 50 per cent in the country, as private sector players - Bharti Airtel, Vodafone Idea and Reliance Jio - on Sunday announced their plans to raise tariffs from December 3 onwards. This is the first hike in last five years in the country's telecom space that was facing bruising tariff war, with voice calls becoming almost free and data prices fell by 95 per cent to Rs 11.78 per GB from Rs 269 per GB in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X