మోదీ నల్ల ఆంగ్లేయుడు... నవజ్యోత్ సింగ్ సిద్దూ
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు నల్ల బ్రిటిషర్లు అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అభివర్ణించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోరో ఎన్నికల ప్రచారంలో పాల్గో్న్న సిద్దూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని మహాత్మగాంధి,మౌలానా అజాద్ లాంటీ వాళ్లు నిర్మించారని... కాంగ్రెస్ పార్టీ వలసవాదుల నుండి దేశానికి స్వాతంత్య్ర్రం తెచ్చిన పార్టీ అని అన్నారు. ఇండోర్ ప్రజలంతా నల్ల బ్రిటిషర్లు, చౌకిదార్ల నుండి స్వాతంత్ర్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. మోడీ బడా పారీశ్రామిక వేత్తలైన అంబానీ, అదానిలకు మాత్రమే ఆయన చౌకిదార్ అంటూ దుయ్యబట్టారు. దేశంలోని పారీశ్రామికవేత్తలకు 35లక్షల కోట్ల రుణాలను మాఫి చేసిన ప్రధాని, రైతుల రుణాలను ఎందుకు మాఫి చేయలేదని ప్రశ్నించారు.
నలుపైతేనేమీ మోదీ మనసున్నోడు..
ప్రధాని నరేంద్ర మోడీపై నల్ల అంగ్లేయులంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ తీవ్రంగా మండిపడింది. మోడీ నలుపు అయితేనేమీ అయన మనసున్నోడు, పేదల పక్షం ఉన్నోడు, దేశం మొత్తం కావాలనుకుంటున్నోడు అంటూ ఆయన వ్యాఖ్యలను తిప్పికోట్టారు. బీజేపీ అధికార ప్రతిని ధి సంబిత్ పాత్రా.
కాగా సిద్దు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమీషన్ కు పిర్యాధు చేసింది. దీంతో బీజేపీ పిర్యాధుపై స్పిందించిన ఈసీ సిద్దుకు నోటీసులు జారీచేసింది.కాగా గత నెలరోజుల క్రితమే సిద్దూ మోడీ గవర్నమెంట్ కంట్రోల్ బ్యాంక్ లను డబ్బలు తీసుకుంటున్న రాష్ట్ర్రీయ ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆప్పుడు కూడ ఈసీ సిద్దూకు నోటీసులు జారీ చేయగా ఇప్పుడు రెండోసారి నోటీసులను జారీ చేసింది.