సుప్రీంకు చేరిన పీఎం నరేంద్రమోడీ
ఢిల్లీ : మోడీ బయోపిక్ పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదల అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది. మోడీ బయోపిక్ నిర్మాతలు ఈ పిటీషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ నెల 15న వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!
ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలంటూ విపక్షాలు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. పీఎం నరేంద్రమోడీ విడుదల నిర్ణయాన్ని ఈసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదలకు నిరాకరించింది. ఎన్నికలు ముగిసే వరకు మోడీ బయోపిక్ సహా రాజకీయ నాయకుల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.