ఎన్నికల వేళ: రైతులకు గుడ్ న్యూస్... కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో మోడీ సర్కార్ రైతులకు కానుక ఇచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో వరి, ఖరీఫ్ పంటలకు సంబంధించిన మద్దతు ధరను పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.1500 కోట్లు భారం పడనుంది.
2014 ఎన్నికల సమయంలో రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర 1.5రెట్లు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కో ప్రకటన చేసింది. దీనికి అనుబంధంగానే కేంద్రం ఈరోజు కనీస మద్దతు ధర పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరీఫ్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. వరి సాధారణ గ్రేడ్కు కనీస మద్దతు ధర రూ.200 పెంచగా... అది ఇప్పుడు కొత్తగా క్వింటాల్ రూ. 1750కు చేరింది. గ్రేడ్ ఏ వెరైటీ పై రూ.160 పెంచింది. దీంతో అది కూడా రూ. 1750కు చేరింది.

కనీస మద్దతు ధర పెంచకముందు సాధారణ వరి ధర క్వింటల్కు రూ. 1550 పలుకగా... అదే గ్రేడ్ ఏ వరి ధర రూ.1590 పలికింది. ఇక భారత ఆహార సంస్థ రైతుల నుంచి ఈ పంటలు ధాన్యాలు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆహార భద్రత చట్టం కింద వీటిని సరఫరా చేస్తుంది. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన కనీస మద్దతు ధర సీఏసీపీ ఇచ్చిన మద్దతు ధరకంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications