ఓటు వేసిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రనిప్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్లో ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటు వేసిన అనంతరం కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినంత ఆనందం కలిగిందని మోడీ చెప్పారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని ప్రశంసించారు. మూడో దశ పోలింగ్కు ఓటర్లు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయించబోతోందని చెప్పారు.
#WATCH PM Narendra Modi after casting his vote in Ahmedabad says, " The weapon of terrorism is IED, the strength of democracy is voter ID." #LokSabhaElections2019 pic.twitter.com/X0LBPI5qcu
— ANI (@ANI) April 23, 2019
అంతకు ముందు గాంధీనగర్లోని నివాసంలో ఉన్న తల్లిని మోడీ కలుసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్కు బయలుదేరారు. పోలింగ్ స్టేషన్ వద్ద అమిత్ షా, ఆయన కుటుంబసభ్యులు మోడీకి స్వాగతం పలికారు. అమిత్ షా మనవరాలితో మోడీ కాసేపు కబుర్లు చెప్పారు.