వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు వేసిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రనిప్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటు వేసిన అనంతరం కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినంత ఆనందం కలిగిందని మోడీ చెప్పారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని ప్రశంసించారు. మూడో దశ పోలింగ్‌కు ఓటర్లు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయించబోతోందని చెప్పారు.

అంతకు ముందు గాంధీ‌నగర్‌లోని నివాసంలో ఉన్న తల్లిని మోడీ కలుసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్‌కు బయలుదేరారు. పోలింగ్ స్టేషన్ వద్ద అమిత్ షా, ఆయన కుటుంబసభ్యులు మోడీకి స్వాగతం పలికారు. అమిత్ షా మనవరాలితో మోడీ కాసేపు కబుర్లు చెప్పారు.

Modi cast his vote at ahmedabad
English summary
PM Narendra Modi cast his vote in Ahmedabad in the third phase of Lok Sabha elections. Amit Shah and his family greeted PM Modi outside the polling booth on Tuesday morning before PM Modi cast his vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X