ఐదువందలతో వివాహం చేసుకొన్న జంటను అభినందించిన ప్రధానమంత్రి మోడీ
గుజరాత్ కు చెందిన ఓ జంట వివాహం చేసుకొనేందుకు ఐదువందల రూపాయాలనే ఖర్చు చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దంపతులను ఆశీర్వదించారు. ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ఈ జం
సూరత్ :పెద్ద నగదు నోట్ల రద్దు తో సాదాసీదాగా వివాహం జరుపుకొన్న ఓ జంటను ప్రధామంత్రి నరేంద్రమోడీ ఆశీర్వదించాడు. ఘనంగా వివాహం చేసుకోవాలని భావించినా పెద్ద నగదు నోట్ల రద్దుతో ఐదువందల రూపాయాల ఖర్చుతోనే వివాహం చేసుకొన్న గుజరాత్ జంటను మోదీ ప్రశంసలతో ముంచెత్తాడు.
గుజరాత్ రాష్ట్రానికిచెందిన ఓ జంట సాదాసీదాగా వివాహం చేసుకొన్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు కేవలం టీ మాత్రమే ఇచ్చారు. టీ కోసం ఐదు వందల రూపాయాలను ఖర్చు చేశారు. ఈ వివాహంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
హంగు ఆర్బాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరిగాయి.కేవలం ఈ వేడుకలకు ైదు రూపాయాలను ఖర్చు చేశారు. వివాహానికి హాజరైన అతిథులకు టీ ఇచ్చేందుకు ఈ ఐదువందలను ఖర్చు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు వివాహానికి వచ్చిన వారంతా ఈ వివాహం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు నూతన దంపతులను ఆశీర్వదించారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ తమ వివాహన్ని ప్రస్తావించి తమను ఆశీర్వదించడం పట్ల ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.