మోదీకి కనీసం సుప్రీం కోర్టు నియమాలు కూడా తెలియవు..! ప్రధానిపై చిందేసిని చిదంబరం..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఎండీయే ప్రభుత్వం పై కాంగ్రెస్ విమర్శలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు కేంద్రాన్ని మోదీ రాజ్యం అంటూ సంబోదించాడు. అలాగే బీజీపీ శాంతి కంటే యుద్దాన్నే కోరుకుంటుందని వ్యాఖ్యానించాడు.
నేడే అమేథీలో రాహుల్ నామినేషన్..! భారీ రోడ్ షో కి కసరత్తు చేస్తున్న నేతలు..!!
తమ వైపల్యాలను దాచుకోవడానికే మేనిఫెస్టోలో దేశ భద్రత అనే అంశాన్నిచేర్చి ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక అధికారాలకు సంబంధించిన నిబంధనలు 370, 35ఏను సవరించడం..ఆ రాష్ట్రంలో పెద్ద విపత్తుకు బీజం వేసినట్లేనని పరోక్షంగా బీజేపీ హామీని దుయ్యబట్టారు.
మోదీ రాజ్యంలో న్యాయం తిరోగమనంలో ఉందంటూ ఎద్దేవా చేశారు చిదంబరం. కనీసం సుప్రీం కోర్టు నియమాలు అయినా తెలుసుకోవాలని చురకలు అంటించారు. ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న అత్యాచారాలు, హింసను అరికట్టడం భాజపాకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. మోదీ రాజ్యంలో మొదట నేరస్థులవుతారు.
ఆ తర్వాతే విచారణ జరుగుతుంది. తాను అమాయకుడిని అని నిరూపితమయ్యే వరకు ఆ వ్యక్తి దోషిగానే పరిగణించబడతాడు. ఈ విషయంలో ప్రధానికి ఏమైనా సందేహం ఉంటే, తన మిత్రుడు జైట్లీని సంప్రదిస్తారని చిదంబరం ట్వీట్ చేశారు.